Hyderabad: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ సంపులో పడి బాలుడు మృతి
ABN, First Publish Date - 2022-07-07T20:51:35+05:30
నగరంలోని కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. అశోక్కాలనీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద గత రెండు నెలలుగా రాకేష్ అనే వ్యక్తి వాచ్మెన్గా పని చేస్తున్నాడు. తన కుమారుడు ఫణి బాలాజీ(3) కనిపించక పోవడంతో కుషాయిగూడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి సంపులో బాలుడి శవంపైకి తేలడంతో తల్లిదండ్రులు వెలికితీశారు. బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-07-07T20:51:35+05:30 IST