మహేష్ బ్యాంక్ కేసులో పుగరోగతి: సీపీ ఆనంద్
ABN, First Publish Date - 2022-01-27T21:17:22+05:30
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేష్ బ్యాంక్ హ్యాకింగ్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోందని నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో పురోగతి సాధించామని సీపీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పలు ఖాతాల్లోని రూ.3 కోట్లు నిలుపుదల చేశామని సీపీ తెలిపారు. ఖాతాలు తెరిచినవారి వివరాలు, తెరిపించిన వారి వివరాలు గుర్తించామన్నారు. హ్యాకింగ్ జరగడానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ సర్వర్లో సమస్యలేనని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు బ్యాంక్పై కూడా కేసు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆన్లైన్ బ్యాంకింగ్కు సరైన సైబర్ సెక్యూరిటీ లేదన్నారు. మొత్తం 12.9 కోట్ల నగదును 3 ఖాతాల నుంచి దేశంలోని 120కిపైగా ఖాతాల్లోకి మళ్లించారని సీపీ తెలిపారు.
Updated Date - 2022-01-27T21:17:22+05:30 IST