Hyderabadలో దారుణం
ABN, First Publish Date - 2022-05-21T02:50:00+05:30
బేగంబజారులో యువకుడు దారుణ హత్య జరిగింది. నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని కత్తులతో దుండగులు దాడిచేసి చంపారు.
హైదరాబాద్: బేగంబజారులో యువకుడు దారుణ హత్య జరిగింది. నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని కత్తులతో దుండగులు దాడిచేసి చంపారు. యువకుడిని నలుగురు దుండగులు 20 సార్లు కత్తితో పొడిచినట్లు చెబుతున్నారు. ఇటీవల నీరజ్ పన్వార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబీకులే హత్య చేయించారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేగంబజార్ మచ్చి మార్కెట్ సమీపంలో ఘటన జరిగింది. షాహీనాథ్గంజ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-05-21T02:50:00+05:30 IST