ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయిగణేష్ ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2022-04-22T21:03:26+05:30

బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యపై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. సాయిగణేష్ మృతికి మంత్రి, జిల్లా పోలీసులే కారణమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సాయిగణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ఈ ఘటనలో 8 మందిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. కేసు విచారణలో ఉన్నందున తమకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టును కోరారు. కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 29కు వాయిదా వేశారు.


మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ భర్త ప్రసన్నకృష్ణ కలిసి సాయిగణేష్‌పై పలు కేసుల పెట్టించి.. పదేపదే స్టేషనకు పిలిపించి వేధింపులకు గురిచేశారని, అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు చెబుతున్నారు. సాయిగణేష్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-04-22T21:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising