Flood: హైదరాబాద్లో జంట జలాశయాలకు భారీగా వరద
ABN, First Publish Date - 2022-07-23T14:32:23+05:30
వర్షాల కారణంగా భాగ్యనగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
హైదరాబాద్: వర్షాల కారణంగా భాగ్యనగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్సాగర్(Osman sagar) ఇన్ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్సాగర్ నాలుగు గేట్లను ఎత్తి 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1786.65 అడుగులకు చేరింది. అటు హిమాయత్సాగర్(Himayath sagar)కు 500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులకు చేరింది.
Updated Date - 2022-07-23T14:32:23+05:30 IST