హనుమకొండలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-04-28T15:29:04+05:30
జిల్లాలోని కమలాపూర్ మండలం అంబాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హనుమకొండ: జిల్లాలోని కమలాపూర్ మండలం అంబాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రియల్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి వెంచర్ గోడలను స్థానికులు కూల్చివేసి, అక్కడే వంటావార్పు నిర్వహించారు. కొంత భూమి కొని, ఐదు ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. రియల్టర్ దురాగతంపై స్థానికులు తిరగబడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Updated Date - 2022-04-28T15:29:04+05:30 IST