ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ విద్యార్థులు సన్నద్ధం కావాలి
ABN, First Publish Date - 2022-01-03T16:39:45+05:30
ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ విద్యా ర్థులందరూ పోరాటానికి సన్నద్ధం కావాలని మాదిగ స్టూడెంట్ ఫెడ రేషన్ (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ పిలుపు నిచ్చారు.
కేయూ క్యాంపస్, జనవరి 2: ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ విద్యా ర్థులందరూ పోరాటానికి సన్నద్ధం కావాలని మాదిగ స్టూడెంట్ ఫెడ రేషన్ (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ పిలుపు నిచ్చారు. ఆదివారం కేయూ అతిథి గృహంలో ఎంఎస్ఎఫ్ ఇన్చార్జి వడ్డెపల్లి మధు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గోవింద్ నరేశ్ హా జరై మాట్లాడారు. ఈనెల 6న మాదిగ విద్యార్థుల రాష్ట్ర సదస్సుకు ఎ మ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కాకతీయ యూనివర్సిటీ రానున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెస్సీ జాతీయ నాయకులు వేల్పుల సూరన్న, జిల్లా నాయకులు చంద్రశేఖర్, ఎంఎస్ఎఫ్ కేయూ నాయకులు సతీశ్, సంజు, ఆనంద్, ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ఆలేటి నాగరాజు, జన్ను మఽధుకర్, అరవింద్, సాయిచరణ్, కోటేశ్, వేణు, గణేశ్ తదితరులుపాల్గొన్నారు.
Updated Date - 2022-01-03T16:39:45+05:30 IST