వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై విచారం
ABN, First Publish Date - 2022-04-22T22:36:29+05:30
వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై విచారం
హైదరాబాద్: వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుంది. యువతి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చూడాలని తమిళిసై అన్నారు.
Updated Date - 2022-04-22T22:36:29+05:30 IST