ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిస్వార్థసేవకులు డాక్టర్లు:గవర్నర్ తమిళిసై

ABN, First Publish Date - 2022-06-30T21:57:11+05:30

రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జూలై 1 ‘నేషనల్ డాక్టర్స్ డే’ సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్ డాక్టర్ల సేవలను కొనియాడారు. కోవిడ్-19 సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా డాక్టర్లు అందించిన సేవలను మరువలేమని చెప్పారు. ఎంతో రిస్క్ తీసుకుని కోవిడ్ రోగులను కాపాడేందుకు వారు పని చేశారని అన్నారు. అదే కమిట్ మెంట్ తో డాక్టర్లు తమ వ`త్తిలో పునరంకితం కావాలని అన్నారు. 


ప్రతి సంవత్సరం జూలై1న డాక్టర్స్ డే గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ వర్ధంతి,జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు. ప్రాణాలను కాపాడే డాక్టర్లను స్మరించుకోవడం, వారి సేవలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అన్నారు. 

Updated Date - 2022-06-30T21:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising