నిస్వార్థసేవకులు డాక్టర్లు:గవర్నర్ తమిళిసై
ABN, First Publish Date - 2022-06-30T21:57:11+05:30
రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
హైదరాబాద్: రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జూలై 1 ‘నేషనల్ డాక్టర్స్ డే’ సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్ డాక్టర్ల సేవలను కొనియాడారు. కోవిడ్-19 సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా డాక్టర్లు అందించిన సేవలను మరువలేమని చెప్పారు. ఎంతో రిస్క్ తీసుకుని కోవిడ్ రోగులను కాపాడేందుకు వారు పని చేశారని అన్నారు. అదే కమిట్ మెంట్ తో డాక్టర్లు తమ వ`త్తిలో పునరంకితం కావాలని అన్నారు.
ప్రతి సంవత్సరం జూలై1న డాక్టర్స్ డే గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ వర్ధంతి,జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు. ప్రాణాలను కాపాడే డాక్టర్లను స్మరించుకోవడం, వారి సేవలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అన్నారు.
Updated Date - 2022-06-30T21:57:11+05:30 IST