శాంతించిన Godavari... కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
ABN, First Publish Date - 2022-07-16T13:51:11+05:30
భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.
ములుగు: భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర 18.610 మీటర్ల నుంచి 17.500 మీటర్లకు వరద ప్రవాహం తగ్గింది. కాగా... మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధలోనే ఉన్నాయి. మరోవైపు ఈరోజు ఏటూరునాగారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించనున్నారు. అటు భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు.
Updated Date - 2022-07-16T13:51:11+05:30 IST