నలుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు
ABN, First Publish Date - 2022-03-06T00:29:44+05:30
మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న నలుగురు సానుభూతిపరులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
దుమ్ముగూడెం: మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న నలుగురు సానుభూతిపరులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారినుంచి రూ3.34లక్షల నగదు, కారు, రెండు బైక్లు, నాలుగు మొబైల్ఫోన్లను స్వాధీన చేసుకున్నారు. వీరిని చర్ల మండలం బోధనవెల్లి గ్రామానికి చెందిన వర్సారాజు, ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరావు, హైదరాబాదుకు చెందిన గేదెల శ్రీనివాసరావుగా గుర్తించారు. హైదరాబాదుకు చెందిన కాంట్రాక్టర్ పభాకర్, హన్మకొండకు చెందిన కొమరం రామ్మూర్తి నుంచి నగదు సేకరించి తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులెవరూ మావోయిస్టు పార్టీకి సహాయ, సహకారాలు అందించవద్దని పోలీసులు కోరారు.
Updated Date - 2022-03-06T00:29:44+05:30 IST