ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత: ఈటల రాజేందర్

ABN, First Publish Date - 2022-09-23T02:53:09+05:30

టీఆర్‌ఎస్‌ (TRS) ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చేది గోరంత అని.. దోచుకునేది మాత్రం కొండంత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌: టీఆర్‌ఎస్‌ (TRS) ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చేది గోరంత అని.. దోచుకునేది మాత్రం కొండంత అని  ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajender) మండిపడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పింఛన్‌ తదితర సంక్షేమ పథకాలకు రూ.25వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. కానీ ఆర్టీసీ టికెట్లు, రిజిస్ర్టేషన్‌ ఫీజులు, మద్యం.. తదితర వాటి ద్వారా సంవత్సరానికి రూ.42 వేల కోట్లు ఆదాయాన్ని పొందుతోందన్నారని తెలిపారు. అయినప్పటికీ రైతులకు రుణమాఫీ చేయకపోగా కౌలు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు శుద్ధజలం రాకపోగా.. ఈ పథకం ద్వారా రూ.40వేల కోట్లు వృథా అయ్యాయని విమర్శించారు. అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌రూంలు, దళిత పథకం ద్వారా 3 ఎకరాల భూమి అందడం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు.

Updated Date - 2022-09-23T02:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising