దొంగే దొంగన్నట్లుగా కేసీఆర్ పరిస్థితి: ఈటల
ABN, First Publish Date - 2022-05-28T23:59:25+05:30
దొంగే దొంగన్నట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.
కరీంనగర్ జిల్లా: దొంగే దొంగన్నట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. శనివారం శంకరపట్నం మండలంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈటల పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తన చేతకాని తనాన్ని కేంద్రం పై నెడుతున్నారని మండిపడ్డారు.కేసీఆర్ 101 తప్పులు చేశాడు.. దేశంలో చట్టం ఉందని గుర్తుచేశారు.కాంగ్రెస్ ఢిల్లీలో ఆరిపోయింది ఇక్కడ వెలిగే పరిస్థితి లేదని దెప్పిపొడిశారు.రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.
Updated Date - 2022-05-28T23:59:25+05:30 IST