ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

ABN, First Publish Date - 2022-08-26T00:06:30+05:30

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు (Errabelli Pradeep Rao) బీజేపీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు (Errabelli Pradeep Rao) బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి నడ్డా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ (BJP)కి మంచి మూమెంట్ ఉందని కొనియాడారు. తెలంగాణ (Telangana)లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. ప్రదీప్‌రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సోదరుడు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో ఏర్పడిన విభేదాలతో పాటు, తన సోదరుడు దయాకర్‌రావు మంత్రివర్గంలో ఉండడంతో తనకు రావాల్సిన పదవులు రావడం లేదనే భావనలో ప్రదీప్‌రావు ఉన్నట్టు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావించారు. అయితే ఆ స్థానం నుంచి నన్నపునేని నరేందర్‌‌ను బరిలోకి దింపారు. ఆ టికెట్‌ దక్కించుకున్న నరేందర్‌ ఎన్నికల్లో గెలిచారు. అప్పుడే ప్రదీప్‌రావు అసంతృప్తి తెలపడంతో ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీతో టీఆర్‌ఎస్‌ బుజ్జగించింది. టీఆర్‌ఎస్‌లో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బృందం ప్రదీప్‌రావుతో పలు దఫాలుగా చర్చలు జరిపి పార్టీలో చేరికకు లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలిసింది.

Updated Date - 2022-08-26T00:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising