TS news: షాద్నగర్ టోల్ప్లాజా దగ్గర ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
ABN, First Publish Date - 2022-07-30T20:01:52+05:30
షాద్నగర్ టోల్ప్లాజా దగ్గర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు.
రంగారెడ్డి: షాద్నగర్ టోల్ప్లాజా దగ్గర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గోవా నుంచి హైదరాబాద్కు అక్రమంగా డ్రగ్స్ (Drugs) రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాయికల్ టోల్ప్లాజా వద్ద రూట్ వాచ్లో వ్యక్తి దగ్గర డ్రగ్స్ను గుర్తించారు. నిందితుడి నుంచి 3 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఈసీఎస్టీఏఎస్వై, 5.491 గ్రాముల ఎమ్డీఎంఏ, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అమీర్పేటకు చెందిన శబరీష్గా గుర్తించారు. శబరీష్ను అరెస్ట్ చేయగా... లోకేష్ అనే మరో నిందితుడు పరారయ్యాడు. ఇద్దరి నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శబరీష్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆపై రిమాండ్కు తరలించారు.
Updated Date - 2022-07-30T20:01:52+05:30 IST