యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2022-06-05T15:44:13+05:30
యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రి: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండకింద కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించిన భక్తజనులు, ఉచిత దర్శన టోకెన్లు పొంది కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. భక్తులు ప్రధానాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. క్యూ కాంప్లెక్స్లు నిండటంతో.. స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు అర గంట సమయం పడుతోంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
Updated Date - 2022-06-05T15:44:13+05:30 IST