ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉట్నూర్‌ కేజీబీవీలో విద్యార్థిని మృతి.. ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-08-10T10:15:36+05:30

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కేజీబీవీలో పదో తర గతి విద్యార్థిని కవిత (15) చనిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనారోగ్యం వల్లేనన్న పాఠశాల సిబ్బంది

దర్యాప్తు కోసం తల్లిదండ్రుల డిమాండ్‌


ఉట్నూర్‌, ఆగస్టు 9: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కేజీబీవీలో పదో తర గతి విద్యార్థిని కవిత (15) చనిపోయింది. కవిత అనారోగ్యంతో చనిపోయిందని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. తమ కుమార్తె మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కవిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. దంతన్‌పల్లి జెండాగూడకు చెందిన కవిత సోమవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున కవిత చనిపోయింది. విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. విద్యార్థిని మృతదేహంతో ఐటీడీఏ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-08-10T10:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising