రేపు రాజీవ్ సంస్మరణ సభ: VH
ABN, First Publish Date - 2022-05-20T18:28:29+05:30
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రేపు(శనివారం) నగరంలోని సోమాజిగూడలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు.
హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రేపు(శనివారం) నగరంలోని సోమాజిగూడలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. అందరూ హాజరుకావాలని కోరారు. నేడు ఐటీలో భారతదేశం ముందుంది అంటే రాజీవ్ గాంధీ సంస్కరణలే కారణమని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలతో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 22 నుండి రైతు డిక్లరేషన్పై గ్రామాలు తిరుగుతూ రైతులకు వివరించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని రాష్ట్రాలలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడాన్ని హర్షిస్తున్నట్లు వీహెచ్ పేర్కొన్నారు.
Updated Date - 2022-05-20T18:28:29+05:30 IST