మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలు
ABN, First Publish Date - 2022-11-25T03:57:20+05:30
వ్యవసాయ, భూసమస్యలపై టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, భూసమస్యలపై టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయదారుల సమస్యలు, భూ వివాదాలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
Updated Date - 2022-11-25T03:57:21+05:30 IST