ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Jeevan reddy: సెప్టెంబర్ 17పై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు

ABN, First Publish Date - 2022-09-03T20:16:00+05:30

సెప్టెంబర్ 17పై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan reddy) విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సెప్టెంబర్ 17పై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan reddy) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...  హైదరాబాద్ విలీనంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌(Congress)కే ఉందని అన్నారు. సీబీఐని రాష్ట్రాల్లోకి అనుమతించొద్దని కేసీఆర్ అనడం ఆశ్చర్యం కలిగిస్తోందిన్నారు. సీబీఐ విచారణ వద్దంటే.. రాష్ట్రంలో సీఐడీ విచారణ కూడా జరగొద్దని అన్నారు. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) ప్రజా సమస్యలు పక్కన పెట్టి రేషన్ కార్డులపై బొమ్మల కోసం గొడవ పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ (CM KCR) జాతీయ పార్టీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. కేసీఆర్ (Telangana CM) ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని భావించడం లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T20:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising