TS News: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా
ABN, First Publish Date - 2022-07-25T18:11:37+05:30
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది.
హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) వ్యవహారంపై కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఆరా తీస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore) రంగంలోకి దిగారు. నిన్న తన నివాసంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కోమటిరెడ్డి మాట్లాడిన అంశాలను అధిష్టానం క్లిప్పింగ్స్ తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా పార్టీ విషయంలో చేసిన కామెంట్స్, ఇచ్చిన వివరణలను ఠాగూర్ తెప్పించుకున్నారు. గతంలో ఆర్సీ కుంతియా(RC Kuntia), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy), రేవంత్ రెడ్డి (Revanth reddy), పార్టీ విషయంలో అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా చేసిన కామెంట్స్ను కూడా ఠాగూర్ పరిశీలిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీ (Sonia gandhi) విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. పార్టీ మారడం చారిత్రాత్మక అవసరం అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2022-07-25T18:11:37+05:30 IST