‘అగ్నిపథ్’ మంటలు చల్లారలేదు: VH
ABN, First Publish Date - 2022-06-20T19:17:19+05:30
‘‘అగ్నిపథ్’’ మంటలు చల్లారలేదని.. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత రావు అన్నారు.
హైదరాబాద్: ‘‘అగ్నిపథ్’’ మంటలు చల్లారలేదని.. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత రావు(V.Hanumanth rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...ఆర్మీ అధికారులు మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లుందని మండిపడ్డారు. పార్లమెంట్లో చర్చలు ఉండవని.. ప్రతిపక్షంతో చర్చలు లేవని అన్నారు. ప్రధాని మోదీ(Modi).. కార్పొరేట్ కంపెనీల చేతిలో బందీ అయ్యారని ఆరోపించారు. నరేంద్రమోదీ.. ఇకనైనా మన్మోహన్ సింగ్ పాలనను గుర్తు చేసుకోవాలని హితవుపలికారు. ఆఖరికి సైన్యాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సేవ చేసే వారి విషయంలో అవమానకరంగా వ్యవహరిస్తోందన్నారు. సైనికుల పట్ల అవమానకరంగా మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-20T19:17:19+05:30 IST