ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డీ వ్యాపారులకు అండగా ఎంపీ అరవింద్: మధుయాష్కీ

ABN, First Publish Date - 2022-01-10T23:31:06+05:30

పాల్వంచలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాల్వంచలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ ఘటన మరువక ముందే నిజామాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం అప్పులతో విజయవాడలో ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ అన్నారు. దీనికి కారణం ఆ నలుగురు వడ్డి వ్యాపారులేనని ఆయన పేర్కొన్నారు. వడ్డి వ్యాపారులకు  బీజేపీ ఎంపీ అరవింద్, టీఆర్ఎస్ నేత అండదండలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు కుటుంబాన్ని పరామర్శించకుండా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా పాతరపెడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగ సంఘాలు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశ పడవద్దని ఆయన హితవు పలికారు. 317 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-10T23:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising