Congress leader: ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారు
ABN, First Publish Date - 2022-08-19T19:27:18+05:30
ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారని ధర్మపురి కాంగ్రెస్ ఇంచార్జ్ లక్ష్మణ్ ఆరోపించారు.
కరీంనగర్: ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్యాయంగా గెలిచారని ధర్మపురి కాంగ్రెస్ ఇంచార్జ్ లక్ష్మణ్ (Laxman) ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీగా గెలిస్తే మంత్రి కొప్పుల (Telangana Minister) రీ కౌంటింగ్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న రీకౌంటింగ్ కోరాలన్నారు. ఆరుగురు లాయర్లతో కొప్పుల కోర్టుకెళ్లారని తెలిపారు. కొప్పుల ఈశ్వర్ లాయర్ల ఖర్చులు కేసీఆర్ (CM KCR) కుటుంబం భరిస్తోందన్నారు. కేసీఆర్ (KCR) మంత్రివర్గంలో కొనసాగడానికి కొప్పుల అనర్హుడని కాంగ్రెస్ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-08-19T19:27:18+05:30 IST