అప్పులతో 40 మంది రైతులు ఆత్మహత్యలు: అన్వేష్రెడ్డి
ABN, First Publish Date - 2022-01-25T22:13:08+05:30
అప్పులు పెరిగి రాష్ట్రంలో దాదాపు 40 మంది
హైదరాబాద్: అప్పులు పెరిగి రాష్ట్రంలో దాదాపు 40 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత అన్వేష్రెడ్డి అన్నారు. మిర్చి పంటకు తామర పురుగు సోకడం వల్ల రైతులకు దిగుబడి రావడం లేదన్నారు. నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
Updated Date - 2022-01-25T22:13:08+05:30 IST