ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jairam Ramesh: కేసీఆర్‌కు BRS సమయం కాదు.. VRS సమయం

ABN, First Publish Date - 2022-10-05T02:47:51+05:30

ప్రజలను సంఘటితం చేయడానికే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  ప్రజలను సంఘటితం చేయడానికే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర (Congress Bharat JOdo Yatra) అని కాంగ్రెస్ ఏఐసీసీ నేత జైరాం రమేశ్ అన్నారు.  ఈనెల 6న రాహుల్ పాదయాత్రలో సోనియా గాంధీ (Sonia Gandhi) పాల్గొననున్నారని ఆయన తెలిపారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర జరగబోతోంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా  జైరామ్ రమేశ్ మాట్లాడుతూ  ఏపీలో 62, తెలంగాణలో 360 కిలో మీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో 4 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని వెల్లడించారు.  ఈనెల 24న తెలంగాణలో రాహుల్ పాదయాత్ర  చేయనున్నారని తెలిపారు.  తెలంగాణలో ప్రజలకు రెండు మెసేజ్‌లు రానున్నాయని..  బీజేపీ, టీఆర్‌ఎస్‌ విధానాలపై యాత్ర జరుగుతుందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒకే నాణేనికి రెండు వైపుల్లాంటివని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఇది BRS సమయం కాదని.. VRS సమయం అని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. 


Updated Date - 2022-10-05T02:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising