Warangal ఎనుమాముల మార్కెట్లో అడ్తీ వ్యాపారుల ఆందోళన
ABN, First Publish Date - 2022-06-27T15:13:10+05:30
జిల్లాలోని ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అడ్తీ వ్యాపారులు ఆందోళనకు దిగారు.
వరంగల్: జిల్లాలోని ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అడ్తీ వ్యాపారులు ఆందోళనకు దిగారు. పత్తి, మిర్చి కాంటాలను వ్యాపారులు అడ్డుకున్నారు. గతంలో రూ.4కోట్లు ఎగ్గొట్టిన నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ యజమాని నుంచి డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ యజమాని పోలీసుల అదుపులో ఉన్నాడు. మార్కెట్ కమిటీ పాలకవర్గం, ఓప్రజాప్రతినిధి కలిసి ఎగవేతదారుడికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అడ్తీ వ్యాపారుల ఆందోళనలతో మార్కెట్లో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Updated Date - 2022-06-27T15:13:10+05:30 IST