ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరటాశి తర్వాత దర్శనానికి రండి: టీటీడీ

ABN, First Publish Date - 2022-08-10T10:14:55+05:30

ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ప్రణాళికబద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ప్రణాళికబద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా కోరింది. ‘వేసవి రద్దీ తగ్గినప్పటికీ వారాంతపు రద్దీతో పాటు పండుగతో కూడా వరుస సెలవులు ఆగస్టు 19వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాశి మాసం సెప్టెంబరు 18వ తేదీన ప్రారంభమై అక్టోబరు 17వ తేదీన ముగుస్తుంది. ఈమధ్య కాలంలో తిరుమలలో యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. ఈ కారణంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు తిరుమలకు పెరటాశి మాసం తర్వాత రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొంది. 

Updated Date - 2022-08-10T10:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising