నలుగురు సీఐల బదిలీ
ABN, First Publish Date - 2022-06-24T04:45:10+05:30
నలుగురు సీఐల బదిలీ
ఏనుమాముల సీఐగా విశ్వేశ్వర్
హనుమకొండ క్రైం, జూన్ 23: వరంగల్ పోలీసు కమిషనరేట్లో పని చేస్తున్న నలుగురు సీఐలను బదిలీ చేస్తూ వరంగల్ సీపీ తరు ణ్జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురిలో ఇద్దరికి పోస్టింగ్ ఇవ్వగా, మరో ఇద్దరిని వీఆర్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏనుమాముల మార్కెట్లో ఏర్పాటు కానున్న పోలీసుస్టేషన్ సీఐగా పర్వతగిరి నుంచి బదిలీ అయిన విశ్వేశ్వర్కు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2022-06-24T04:45:10+05:30 IST