పోలీసుల అదుపులో కారు ప్రమాద నిందితులు
ABN, First Publish Date - 2022-01-30T21:54:29+05:30
కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు వీధి వ్యాపారుల పైకి దూసుకెళ్లింది.
కరీంనగర్: కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు వీధి వ్యాపారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు ప్రమాద నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కారును 16 ఏళ్ల మైనర్ నడపటం వల్లే ప్రమాదం జరిగిందని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు మైనర్లున్నారని తెలిపారు. తండ్రి రాజేంద్రప్రసాద్ కొడుకుకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని సీపీ చెప్పారు.
Updated Date - 2022-01-30T21:54:29+05:30 IST