Bypoll Heat: మునుగోడు ఉప ఎన్నిక బరిలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి..కేఏ పాల్
ABN, First Publish Date - 2022-08-06T01:36:11+05:30
Kurnool: మునుగోడు (Munugodu) నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ (Komati reddy Raja Gopal Reddy) రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తర్వలో ఉప ఎన్నికకు ప్రకటన వెలువడనుంది. ఆయా పార్టీలు తమ
Kurnool: మునుగోడు (Munugodu) నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ (Komati reddy Raja Gopal Reddy) రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తర్వలో ఉప ఎన్నికకు ప్రకటన వెలువడనుంది. ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prajashanti Party President KA Paul) కీలక ప్రకటన చేశారు. రేపు (శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు తమ పార్టీ అభ్యర్ధిని ప్రకటిస్తానని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు కేఏ పాల్. రూ. 25 వేల కోట్ల బిజినెస్ ఇస్తామని బీజేపీ(BJP) పెద్దలు ఆఫర్ చేయడంతో ఆయన కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు అన్ని పార్టీల పనితీరు చూశారని, ఈ సారి తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరునెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. తెలంగాణలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. తనపై దాడికి యత్నించిన తిరుపతి సీఐ సురేందర్ రెడ్డి సస్పెండ్ చేయాలని పాల్ డిమాండ్ చేశారు.
Updated Date - 2022-08-06T01:36:11+05:30 IST