భారత విద్యార్థులను తీసుకురండి: కేటీఆర్
ABN, First Publish Date - 2022-02-25T01:43:37+05:30
ఉక్రెయిన్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఉక్రెయిన్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విపత్కర సమయాల్లో ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థుల భద్రత కోసం కేంద్ర మంత్రి జయ శంకర్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేక సందేశాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా పని చేయగలదని, భారతీయులందరినీ వీలైనంత త్వరగా దేశానికి తిరిగి తీసుకురావాలని కేటీఆర్ కోరారు.
Updated Date - 2022-02-25T01:43:37+05:30 IST