కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరు: బండి సంజయ్
ABN, First Publish Date - 2022-01-06T01:40:23+05:30
సీఎం కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరని
కరీంనగర్: సీఎం కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదల అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైలు మాకు కొత్త కాదన్నారు. ఎన్నిసార్లు అయినా పంపండని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి కార్యకర్తలను కొట్టారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు లేదా? బీజేపీ ఆఫీస్ బద్దలుకొడతారా అని ఆయన నిలదీశారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడతాం అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ధర్మయుద్ధం మొదలైందన్నారు. కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరన్నారు.
జీవో 317ను ప్రభుత్వం వెంటనే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండగా బీజేపీ ఉందని సంజయ్ స్పష్టం చేశారు.
Updated Date - 2022-01-06T01:40:23+05:30 IST