తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్
ABN, First Publish Date - 2022-01-28T00:14:08+05:30
రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంవత్సరం మాత్రమే ఉంటుందని, తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని
నిజామాబాద్: రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంవత్సరం మాత్రమే ఉంటుందని, తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. నందిపేట్లో ఎంపీ అర్వింద్ను ఆయన పరామర్శించారు. ఆర్మూర్ దాడి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయలేకపోతున్నామని బాధ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. భయపడి, ఆశపడి పనిచేస్తే ప్రజలు చీదరించుకుంటారన్నారు. అర్వింద్పై నిజామాబాద్ సీపీ నేతృత్వంలో, సీఎంవో డైరెక్షన్లో హత్యాయత్నం జరిగిందన్నారు.
ఎంపీపై దాడి విషయంలో ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాలేదన్నారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ను గౌరవించలేని సంస్కార హీనులు వీరని ఆయన మండిపడ్డారు. నిక్కచ్చిగా పనిచేసే వారు మన గవర్నర్ అని, మాతో కూడా రాజకీయాలు మాట్లాడవద్దని గవర్నర్ చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించాలన్నారు. వెంటనే సీపీపై కేసు నమోదు చేయాలన్నారు. దాడి చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ కార్యకర్తలుగా ఉన్నందుకు తాము గర్వపడుతున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-01-28T00:14:08+05:30 IST