317 జీవోపై పోరాటం కొనసాగుతుంది: బండి
ABN, First Publish Date - 2022-01-08T23:41:48+05:30
317 జీవోపై పోరాటం కొనసాగుతుందని బీజేపీ
హైదరాబాద్: 317 జీవోపై పోరాటం కొనసాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తనతో మోడీ మాట్లాడిన విషయాలను అనంతరం ఆయన వివరించారు. తమ పోరాటానికి కేంద్ర నాయకత్వం పూర్తి మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా నిబంధనల సడలింపు తర్వాత బహిరంగ సభ ఉంటుందని ఆయన తెలిపారు. నిరుద్యోగుల సభకు అమిత్షాను ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. 317 జీవో సవరణ చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు.
Updated Date - 2022-01-08T23:41:48+05:30 IST