కేటీఆర్తో చర్చకు సిద్ధం: Raghunandan rao
ABN, First Publish Date - 2022-04-23T18:30:01+05:30
కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్తో చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు.
హైదరాబాద్: కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్తో చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... 111 జీవోపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు.. కేటీఆర్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్- టీఆర్ఎస్ పొత్తు కోసం ప్రశాంత్ కిషోర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్తో అధికార టీఆర్ఎస్ పొత్తుకు సిద్ధమవుతోందని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ప్రోటోకాల్ విషయంలో అధికారులు వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ళతో జిల్లా యంత్రాంగం పోట్రోకాల్ పక్కనపెట్టడం సరికాదని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు.
Updated Date - 2022-04-23T18:30:01+05:30 IST