ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: Etela

ABN, First Publish Date - 2022-03-15T18:35:16+05:30

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమకు కేటాయించిన సీట్లలో నిలబడితే సస్పెండ్ చేయటం అనైతికమని మండిపడ్డారు. సభా సంప్రదాయాలను మంటగలిపే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని తూలనాడిన మంత్రితో ఉద్యమకారులను సస్పెండ్ చేయించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తరిమి తరిమి కొడతామన్న వ్యాఖ్యలను సీఎం  మర్చిపోయినట్లున్నారని తెలిపారు. తెలంగాణలో చంద్రశేఖర్రావు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తున్నారన్నారు. కేసీఆర్ అహంకారాన్ని బొందపెట్టే అతింత నిర్ణేతలు ప్రజలే అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-15T18:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising