ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మునుగోడులో బీజేపీ నాయకుల మకాం

ABN, First Publish Date - 2022-08-14T22:30:04+05:30

Yadadri: బీజేపీ (BJP) తెలంగాణ నాయకులు ఈనెల 22 నుంచి మునుగోడులో మకాం వేయనున్నారు. 21వ తేదీ అమిత్ షా (Amit sha) సభ తర్వాత నేతలంతా మునుగోడులోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Yadadri:  బీజేపీ (BJP) తెలంగాణ నాయకులు ఈనెల 22 నుంచి మునుగోడులో మకాం వేయనున్నారు. 21వ తేదీ అమిత్ షా (Amit sha) సభ తర్వాత నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. సభ ముగిశాక బైపోల్స్ కమిటీని ప్రకటించనున్నారు. ఇటు బీజేపీ శ్రేణులు అమిత్ షా సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా సమక్షంలోనే  మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి (Komatireddy Raja Gopal Reddy) కాషాయ కండువా కప్పుకోనున్నారు. బైపోల్స్ ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నేతలు రానున్నారు. వారు కేంద్ర పథకాలను మునుగోడు ప్రజలకు వివరించనున్నారు. టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, కుటుంబ పాలనపై విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఆర్టీఐ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించింది. మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలు అంశాలకు సంబంధించి ఆర్టీఐ నుంచి వివరాలు కోరింది బీజేపీ. ఆ సమాచారం రాగానే టీఆర్ఎస్‌ విధానాలను ఎండగట్టాలన్నదే బీజేపీ నిర్ణయంగా కనిపిస్తుంది.

Updated Date - 2022-08-14T22:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising