ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయపడుతున్నారు: Laxman

ABN, First Publish Date - 2022-03-16T18:31:47+05:30

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ బయపడుతున్నారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయపడుతున్నారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...  అసెంబ్లీ సమావేశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ సమావేశాలుగా జరిగాయని విమర్శలు గుప్పించారు. డబుల్ ఇంజన్‌కే నాలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దపీట వేశారని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒకే గూటి పక్షులని అసెంబ్లీ సమావేశాల ద్వారా తేటతెల్లమైందన్నారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్లు అసెంబ్లీలో మాట్లాడి సభను దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు.


హిజాబ్ అంశంపై కేసీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన పతనాన్ని గమనించి మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కరెంటు, నీళ్లు కట్ చేస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్ వల్ల ఒక్క కుటుంబానికే మేలు అని.... తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్‌ను కోరుకుంటున్నారని తెలిపారు. యువత తిరగబడుతుందనే ఉద్యోగ ప్రకటనలు చేశారన్నారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా.. గజ్వేల్‌కు ముఖ్యమంత్రా స్పష్టం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-16T18:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising