ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న Bandi sanjay
ABN, First Publish Date - 2022-04-14T14:14:35+05:30
ఖైరతాబాద్ చౌరస్తాలోలోని మహావీర్ మఠ్ హనుమాన్ ఆలయాన్ని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ చౌరస్తాలోలోని మహావీర్ మఠ్ హనుమాన్ ఆలయాన్ని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలోని శ్రీసీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభంకానుంది. రెండో విడత పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభించనున్నారు. ఉదయం జోగులంబ ఆలయంలో బీజేపీ అధ్యక్షుడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రెండో విడత పాదయాత్ర మే 14న మహేశ్వరంలో ముగియనుంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం ఆలంపూర్లో జరిగే బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొననున్నారు.
Updated Date - 2022-04-14T14:14:35+05:30 IST