రేపు బీజేపీ ఆధ్వర్యంలో ‘జాగరణ’: Bandi sanjay
ABN, First Publish Date - 2022-01-01T18:01:57+05:30
317జీవోను సవరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.
సిద్దిపేట: 317జీవోను సవరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటానికి రేపు రాత్రికి బీజేపీ ఆధ్వర్యంలో జాగరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రాంతా మేల్కొని ప్రభుత్వానికి నిరసన తెల్పుతామన్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
Updated Date - 2022-01-01T18:01:57+05:30 IST