Bandi sanjay: భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదు
ABN, First Publish Date - 2022-08-18T19:49:53+05:30
భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
జనగామ: భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... హిందూ వ్యతిరేక జెండాలను బొందపెడతామని హెచ్చరించారు. ఇమామ్లకు ఇచ్చే గౌరవం.. అర్చకులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ (PM Narendra modi) అని తెలిపారు. అధికారంలోకి రాగానే పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బీజేపీ (BJP)లో లాబీయింగ్లు ఉండవని.. గెలుపు గుర్రాలకే టికెట్లు ఉంటాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Updated Date - 2022-08-18T19:49:53+05:30 IST