Bandi sanjay: స్పీకర్పైనే చర్యలు తీసుకోవాలి.. సభలో చర్చ జరగాలి
ABN, First Publish Date - 2022-09-07T19:45:25+05:30
అసెంబ్లీ నిర్వహించాలంటూ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ నిర్వహించాలంటూ సీఎం కేసీఆర్ (CM KCR) భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు తగదన్నారు. స్పీకర్పైనే చర్యలు తీసుకోవాలని.. సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సభలో ప్రజాసమస్యలపై చర్చించకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ (TRS)తో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని సంజయ్ (BJP Leader) పేర్కొన్నారు.
Updated Date - 2022-09-07T19:45:25+05:30 IST