అన్నిరంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైంది: తరుణ్చుగ్
ABN, First Publish Date - 2022-06-08T23:12:36+05:30
అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని బిజెపి రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు
హైదరాబాద్: అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని బిజెపి రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జంగల్రాజ్ నడుస్తోందన్నారు. కేసీఆర్ ఫాంహౌస్లో..కేటీఆర్ ట్విటర్లో మాత్రమే కనిపిస్తున్నారని చెప్పారు. హోంమంత్రి సెలవుల్లో ఉన్నారంటూ తరుణ్చుగ్ విమర్శించారు.జూబ్లీ హిల్స్ ఘటనపై ఆయన స్పందించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అమలు కావట్లేదని, శాంతి భద్రతలు దిగజారాయని అన్నారు. జూబ్లీహిల్స్ ఘటనపై సీబీఐతో విచారణ జరపించాలని తరుణ్చుగ్ డిమాండ్ చేశారు
Updated Date - 2022-06-08T23:12:36+05:30 IST