గోపన్పల్లిలో BJP కార్పొరేటర్ దౌర్జన్యం
ABN, First Publish Date - 2022-05-21T21:22:48+05:30
గోపన్పల్లిలో బీజేపీ (BJP) కార్పొరేటర్ దౌర్జన్యానికి దిగారు. చెరువుల పరిరక్షణ పేరుతో చెరువులను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు.
సైబరాబాద్: గోపన్పల్లిలో బీజేపీ (BJP) కార్పొరేటర్ దౌర్జన్యానికి దిగారు. చెరువుల పరిరక్షణ పేరుతో చెరువులను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. బీజేపీ నేతలు యోగనంద్, మువ్వు సత్యనారాయణ, జ్ఞానేంద్ర ప్రసాద్, నరేష్, ప్రభాకర్ గోపన్పల్లిలో దేవుళ్ళ చెరువు సందర్శనకు వెళ్లారు. కార్పొరేటర్ గంగాధర్ చెరువులో ఎకరం భూమిని కబ్జా చేసి పార్టీ ఆఫీస్, గెస్ట్హౌస్ (Guesthouse) నిర్మించుకున్నారు. వ్యవహారాన్ని తెలుసుకోవడానికి బీజేపీ నేతలు వెళ్లారు. ఎందుకు వచ్చారంటూ బీజేపీ నేతలపై గంగాధర్ అనుచరులు దాడికి దిగారు. వీడియోలు తీయొద్దంటూ ఫొటోగ్రాఫర్పై కార్పొరేటర్ గంగాధర్ (Gangadhar) దాడి చేశాడు. బీజేపీ నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో మువ్వ సత్యనారాయణ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చందానగర్ పీఎస్లో కార్పొరేటర్ గంగాధర్పై కమిటీ సభ్యుల ఫిర్యాదు చేశారు.
Updated Date - 2022-05-21T21:22:48+05:30 IST