ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్‌కు బీజేపీ పిలుపు

ABN, First Publish Date - 2022-01-30T00:29:55+05:30

ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ చలో డీజీపీ ఆఫీస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ చలో డీజీపీ ఆఫీస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. పార్టీ కార్యాలయం నుండి డీజీపీ ఆఫీస్‌ వరకు బీజేపీ నేతలు ర్యాలీ చేపట్టనున్నారు. పోలీసులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ర్యాలీగా వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డికి మెమోరాండం బీజేపీ నేతలు ఇవ్వనున్నారు.


అంతకుముందు సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌కు కొందరు పోలీసులు కొమ్ముకాస్తున్నారన్నారు. అరాచకాలు, కుట్రలతోనే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌పై రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంజయ్ హెచ్చరించారు.

Updated Date - 2022-01-30T00:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising