ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న వరంగల్‌లో బీజేపీ బహిరంగ సభ యథాతథం

ABN, First Publish Date - 2022-08-25T00:23:45+05:30

ఈనెల 27న వరంగల్‌లో బీజేపీ (BJP) బహిరంగ సభ యథాతథంగా కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ఈనెల 27న వరంగల్‌లో బీజేపీ (BJP) బహిరంగ సభ యథాతథంగా కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఈ నెల 27న వరంగల్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా వరంగల్‌ (Warangal)లో ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభకు హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో బండి సంజయ్ భేటీ అయ్యారు. వరంగల్ సభకు జనసమీకరణపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రైతు డిక్లరేషన్ సభకు ధీటుగా సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. సభకు రెండు లక్షల మందిని తరలించాలని టార్గెట్ పెట్టుకున్నారు. వరంగల్ సభలో భారీ చేరికలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. 


మరోవైపు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. యాత్రలో బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు. రేపటిలోగా ఆధారాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. గురువారం మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.


Updated Date - 2022-08-25T00:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising