ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీబీనగర్‌లో బావిలో పడ్డ యువకుడు

ABN, First Publish Date - 2022-01-01T22:51:01+05:30

బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద దారుణం జరిగింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తున్న ఇద్దరు యువకులపై గూడూరు గ్రామస్తులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీనగర్: బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద దారుణం జరిగింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తున్న ఇద్దరు యువకులపై గూడూరు గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న పాడుపడ్డ బావిలో పడ్డాడు. తప్పించుకున్న యువకుడు ఇచ్చిన సమాచారంతో బావిలో పడ్డ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. టోల్‌ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న డాబా వద్ద భువనగిరి, గూడూరు గ్రామాల యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అది కాస్త చిలికిచిలికి గాలివానలా మారింది. అయితే నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్ నుంచి  ఇద్దరు యువకులు యాదగిరిగుట్టకు వెళ్తుండగా బీబీనగర్ టోల్‌ప్లాజా వద్ద పెట్రోల్ అయిపోయింది. అక్కడే గుమికూడి ఉన్న వ్యక్తుల వద్దకు సాయం కోసం వెళ్లారు. దీంతో తమపై దాడి చేసింది వాళ్లేనంటూ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక యువకుడు బావిలో పడిపోయాడు. 

Updated Date - 2022-01-01T22:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising