Bhupalapalli Districtలో కలకలం రేపుతున్న పులి సంచారం
ABN, First Publish Date - 2022-05-19T17:51:17+05:30
భూపాలపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కమలాపూర్ అటవీప్రాంతంలో పులిసంచారం చేస్తున్నట్లు గ్రామ ప్రజలు
జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కమలాపూర్ అటవీప్రాంతంలో పులిసంచారం చేస్తున్నట్లు గ్రామ ప్రజలు పులి పాదముద్రలను గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆజంనగర్ రేంజి పోలారం వైపు పులి వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో కమలాపురం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Updated Date - 2022-05-19T17:51:17+05:30 IST