నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు చేయడమేంటి?: భట్టి
ABN, First Publish Date - 2022-05-28T20:10:25+05:30
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు చేయడం అక్షేపనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
హైదరాబాద్ : పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు చేయడం అక్షేపనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలర్జంగ్ మ్యూజియంకు వెళ్ళిన యువజన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. సావర్కర్ లాంటి వారి ఫోటోలు పెట్టడం దుర్మార్గమన్నారు. మిమ్మల్ని ప్రజలు క్షమించరని.. గుణపాఠం చెబుతారన్నారు. చదువుకోని వారు ప్రధానులు అయితే ఇలాగే చరిత్రను వక్రీకరిస్తారని భట్టి పేర్కొన్నారు.
Updated Date - 2022-05-28T20:10:25+05:30 IST